sreenuraaz sreenuraaz Author
Title: పడవ బోల్తా:పడవ బోల్తా: ఇద్దరు మృతి Updated By ManamThu, 11/30/2017 - 10:20
Author: sreenuraaz
Rating 5 of 5 Des:
విశాఖ జిల్లాలో సముద్రతీరంలో ఘటన విశాఖ:  విశాఖ జిల్లా ఎస్‌.రాయవరం బంగారమ్మపాలెం సముద్రతీరంలో గురువారం తెల్లవారుజామున సముద్రంలో ప...


  • విశాఖ జిల్లాలో సముద్రతీరంలో ఘటన

Boat turned in Sea, two fishermen, vizag coastal విశాఖ: విశాఖ జిల్లా ఎస్‌.రాయవరం బంగారమ్మపాలెం సముద్రతీరంలో గురువారం తెల్లవారుజామున సముద్రంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు మృతిచెందారు. ఎస్‌.రాయవరం చెందిన 5 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లానికి గల్లంతయ్యారు. సముద్రంలో అలల తాకిడి ఎక్కువ ఉండటంతో వారు వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది.

ఈ ఘటనలో పడవకు సంబంధించిన ఇంజన్‌ ఫ్యాన్‌ తగలడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మరో పడవలో వెళ్తున్న మత్స్యకారులు ఈ ప్రమాదాన్ని గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా వారిలో ఇద్దరు మార్గమధ్యలో మృతిచెందారు. మృతులు ఉమ్మిడి సోమేష్‌(45), మైలపల్లి సత్తయ్య (46)లుగా పోలీసులు గుర్తించారు. మూడో వ్యక్తి తాతారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన వారికోసం రెస్య్కూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.  ఇద్దరు మృతి

Updated By ManamThu, 11/30/2017 - 10:20
  • విశాఖ జిల్లాలో సముద్రతీరంలో ఘటన

Boat turned in Sea, two fishermen, vizag coastal విశాఖ: విశాఖ జిల్లా ఎస్‌.రాయవరం బంగారమ్మపాలెం సముద్రతీరంలో గురువారం తెల్లవారుజామున సముద్రంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు మృతిచెందారు. ఎస్‌.రాయవరం చెందిన 5 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లానికి గల్లంతయ్యారు. సముద్రంలో అలల తాకిడి ఎక్కువ ఉండటంతో వారు వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది.

ఈ ఘటనలో పడవకు సంబంధించిన ఇంజన్‌ ఫ్యాన్‌ తగలడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మరో పడవలో వెళ్తున్న మత్స్యకారులు ఈ ప్రమాదాన్ని గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా వారిలో ఇద్దరు మార్గమధ్యలో మృతిచెందారు. మృతులు ఉమ్మిడి సోమేష్‌(45), మైలపల్లి సత్తయ్య (46)లుగా పోలీసులు గుర్తించారు. మూడో వ్యక్తి తాతారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన వారికోసం రెస్య్కూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. 

Advertisement

 
Top