sreenuraaz sreenuraaz Author
Title: సమస్యల పరిష్కారం కోసం పల్లె నిద్ర
Author: sreenuraaz
Rating 5 of 5 Des:
విశాలాంధ్ర-ఎస్.రాయవరం: ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పల్లె నిద్ర కార్యక్రమం మండల నోడల్ అధికారి కోటేశ్వరరావు అన్నారు. మండలంలో బంగారమ్మపాల...

విశాలాంధ్ర-ఎస్.రాయవరం: ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పల్లె నిద్ర కార్యక్రమం మండల నోడల్ అధికారి కోటేశ్వరరావు అన్నారు. మండలంలో బంగారమ్మపాలెం గ్రామంలో మన గ్రామం-మన విశాఖ కార్యక్రమంలో భాగంగా పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని పరిష్కరం అవే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒకరు మరుగుదొడ్లు నిర్మాణం చేసుకొవలని ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మాణం చేసే ముందు ఆన్లైన్ చేయకుండా గ్రామంలో 100 రూపాయలు చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారని ఎంపిటిసి రాజారావు సభలో ఆరోపించారు. ప్రతి ఇంటికి తిరిగి ఆన్లైన్ చేయమని ఆదేశిస్తూ,ఎవరికి డబ్బులు ఇవ్వరదని మండల నోడల అధికారి అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కోరాడ వేణుగోపాల్,మండల విద్యాశాఖాధికారి ఎ.ఎస్.ఎన్.ఎ.మూర్తి, మండల వ్వవసాయ అధికారి కె. ఉమాప్రసాద్,ఆర్డబ్ల్యూఎస్ జెఇ శ్రీనువాస్,వెలుగు ఎపిఎం శ్రీనువాసరావు, సర్పంచ్ కారే దుర్గరావు, ఎంపిటిసి మైలపల్లి రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

 
Top